ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సుప్రీంకోర్టులో కేసు వేస్తాం..!!

ABN, Publish Date - Aug 05 , 2024 | 01:43 PM

పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉపేక్షించకూడదని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేవరకు ఊరుకోబోమని కంకణం కట్టుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాజ్యాంగ నిపుణులు అయిన న్యాయవాదులతో చర్చలు జరిపారు.

KTR

ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉపేక్షించకూడదని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేవరకు ఊరుకోబోమని కంకణం కట్టుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆధ్వర్యంలో నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాజ్యాంగ నిపుణులు అయిన న్యాయవాదులతో చర్చలు జరిపారు.


తీర్పులు ఇలా..

పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ ఎమ్మెల్యేలకు సంబంధించి, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం కేటీఆర్ బృందానికి తెలిపారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ సాగదీయలేరని స్పష్టం చేశారు. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.


న్యాయ పోరాటం..

రాజ్యాంగ నిపుణుల సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని వివరించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అర్హత వేటు అంశం తేలిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో జనమే బుద్ధి చెబుతారని వివరించారు. జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై కబుర్లూ చెబుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 01:43 PM

Advertising
Advertising
<