ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Instagram: ప్రాణం తీసిన ఇన్‌స్టా స్నేహం

ABN, Publish Date - Aug 10 , 2024 | 04:36 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో చేసిన స్నేహం ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో ఆ యువకుడి వేధింపులు భరించలేక ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

  • ప్రేమ పేరిట యువకుడి వేధింపులు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

గుమ్మడిదల, ఆగస్టు 9: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో చేసిన స్నేహం ఓ యువతి ప్రాణాలు తీసింది. ప్రేమ పేరుతో ఆ యువకుడి వేధింపులు భరించలేక ఓ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తమ ఇంటి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. దోమడుగు గ్రామానికి చెందిన రాజు, సోనీ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె తేజస్విని(20) ఉన్నారు. బీఫార్మసీ సెకండియర్‌ చదువుతున్న తేజస్వినికి అదే గ్రామానికి చెందిన శ్రీహరి కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు.


కొద్ది రోజుల తర్వాత తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని శ్రీహరి వేధించడం మొదలుపెట్టాడు. ఇదే విషయమై తేజస్విని కుటుంబసభ్యులను కూడా బెదిరించాడు. దీంతో తేజస్విని ఇంట్లో నాలుగు రోజుల క్రితం కూడా గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీహరి వేధింపులు తాళలేకపోయిన తేజస్విని గురువారం రాత్రి తమ ఇంటి భవనం మూడో అంతస్తు నుంచి దూకేసింది. రక్తపుమడుగులో పడి ఉన్న తేజస్వినిని కుటుంబసభ్యులు హుటాహుటిన సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా అక్కడ మరణించింది.

Updated Date - Aug 10 , 2024 | 04:36 AM

Advertising
Advertising
<