సీఎం రేవంత్ రెడ్డి మనవడి డ్యాన్స్..

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:22 AM

హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. భక్తుల కోలాటాలు, భజనలు, బ్యాండ్ మేళాలతో అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. దీనికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్: నగరంలో గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. భక్తుల కోలాటాలు, భజనలు, బ్యాండ్ మేళాలతో అంగరంగ వైభవంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. దీనికి జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు చిందులు వేస్తున్న వీడియో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మనవడి డ్యాన్సుకు సీఎం ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ ఏడాది రెండు అడుగుల నుంచి దాదాపు 70 అడుగుల వరకు విశేషంగా వివిధ మండపాల్లో గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు భారీగా చేశారు. శోభా యాత్ర నిర్విగ్నంగా కొనసాగుతోంది. గ్రేటర్‌లో ఈ ఏడాది లక్షా 40 వేల గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 40 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. ఇవాళ లక్ష గణేష్ విగ్రహాల నిమజ్జనం కానున్నాయి. హుస్సేన్‌సాగర్‌లోనే ఈరోజు 30 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనమవుతాయి. వడివడిగా హుస్సేన్‌సాగర్‌ వైపు ఖైరతాబాద్ గణేషుడు తరలుతున్నాడు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

Updated at - Sep 17 , 2024 | 11:01 AM