ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..

ABN, Publish Date - Sep 11 , 2024 | 08:34 AM

అమరావతి: ఉచిత ఇసుక విధానం అమలులో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా బుధవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్‌ పోర్టల్‌ పేరిట నిర్వహించే సైట్‌ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.

అమరావతి: ఉచిత ఇసుక విధానం అమలులో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా బుధవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్‌ పోర్టల్‌ పేరిట నిర్వహించే సైట్‌ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. సైట్‌ నిర్వాహకులు, ఫిర్యాదులు స్వీకరించేవారికి శిక్షణ కార్యక్రమాలు కొలిక్కి వస్తున్నాయి. పోర్టల్‌ పరీక్ష దశలోనే బుధవారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐదారు రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు ఇసుక రవాణా, డెలివరీ వంటి అంశాలను వాస్తవిక సమయంలో పర్యవేక్షించేలా ప్రత్యేక విధానం అమల్లోకి రానుంది. అయితే, ఇసుక రవాణా చార్జీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి..

రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..

ఏలూరు జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన..

సజ్జల ఎక్కడ..?

హరియాణాలో వినేశ్‌ వర్సెస్‌ యోగేశ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 11 , 2024 | 08:34 AM