సుప్రీం కోర్టుకు వెళ్దాం: కేసీఆర్

ABN, Publish Date - Jun 27 , 2024 | 08:51 AM

హైదరాబాద్: ‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు.

హైదరాబాద్: ‘ఆరు నెలల్లో అన్నీ తారుమారవుతాయి.. పరేషాన్‌ కావద్దు’ అని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. పార్టీ నాయకులతో అన్నారు. ఎవరికీ ఎప్పుడూ ఏదీ తక్కువ చేయలేదని, అయినా కొందరు పార్టీ మారడం బాధాకరమన్నారు. అధికార దాహంతో, స్వార్థంతో పార్టీ వీడుతున్న నాయకులపై సుప్రీంకోర్టుకు వెళ్దామని పేర్కొన్నారు. బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి (ఉప్పల్‌), మర్రి రాజశేఖర్‌రెడ్డి (మల్కాజి గిరి), కాలేరు వెంకటేశ్‌ (అంబర్‌పేట), దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి (ఎల్బీ నగర్‌), చామకూర మల్లారెడ్డి (మేడ్చల్‌) కేసీఆర్‌ను కలిశారు. పలువురు నగర ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ స్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ఐదుగురూ కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయ..

బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే

రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?

ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 27 , 2024 | 08:51 AM