Share News

CHAIRMAN: రజకుల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Feb 25 , 2025 | 12:06 AM

రజకుల అభివృద్ధికి కృషిచేస్తామని మున్సిపల్‌ చైర్మన డీఈ రమేష్‌ అన్నారు. సోమవారం బైపా్‌సరోడ్డులో ఉన్న రజకుల కులదైవమైన మాచిదేవ జయంతి కా ర్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి చైర్మన పూజలు చేశారు.

CHAIRMAN: రజకుల అభివృద్ధికి కృషి
Chairman garlanding Machideva idol

హిందూపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రజకుల అభివృద్ధికి కృషిచేస్తామని మున్సిపల్‌ చైర్మన డీఈ రమేష్‌ అన్నారు. సోమవారం బైపా్‌సరోడ్డులో ఉన్న రజకుల కులదైవమైన మాచిదేవ జయంతి కా ర్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి చైర్మన పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ రజకుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని, భవిష్యత్తులో కూడా తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు నిర్వహించి గెలుపొందిన మహిళలకు చీరలు అందజేశారు. మాచిదేవ విద్యా, వృత్తి, సాంస్కృతిక సంఘం గౌరవాధ్యక్షుడు సిద్దేశ్వర్‌ మాట్లాడుతూ రజకులు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనార్దన, నారాయణప్ప, నరసింహప్ప, నరసింహమూర్తి, కుల్లాయప్ప, మురళి పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 12:06 AM