Share News

22 మందికి టీడీఆర్‌ బాండ్ల పంపిణీ

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:46 AM

మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో భూములు కోల్పోయిన వారిలో 22 మందికి సోమవారం బాండ్లు పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీడీఆర్‌ మేళాలో అర్హత పొందిన వీరికి కమిషనర్‌ మౌర్య బాండ్లు అందించారు.

22 మందికి టీడీఆర్‌ బాండ్ల పంపిణీ
లబ్ధిదారులకు టీడీఆర్‌ బాండ్లు అందజేస్తున్న కమిషనర్‌ మౌర్య

తిరుపతి, ఏప్రిల్‌14(ఆంధ్రజ్యోతి): మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో భూములు కోల్పోయిన వారిలో 22 మందికి సోమవారం బాండ్లు పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీడీఆర్‌ మేళాలో అర్హత పొందిన వీరికి కమిషనర్‌ మౌర్య బాండ్లు అందించారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి సంబంధించి 95 శాతం ఆన్‌లైన్‌ చేశామని ఆమె తెలిపారు. కోర్టు కేసులు, ప్రభుత్వ, టీటీడీ భూములు, 22ఏ కింద ఉన్నవి మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఐదు బాండ్లు ఇచ్చామని, సోమవారం 22 బాండ్లు ఇచ్చామన్నారు. ఖాళీ జాగాలకు స్థానిక విలువ ప్రకారం గుర్తించామన్నారు. టీడీఆర్‌ బాండ్ల కమిటీ సమావేశమై 96 మందికి ప్రీ అప్రూవల్‌ తీసుకుని అర్హత ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరందరూ గిఫ్ట్‌ డీడ్‌ ఇస్తే తరువాత బాండ్లు అందజేస్తామని అన్నారు. వీరు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలుగా తిరుపతి, రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆర్డీ విజయభాస్కర్‌, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, డీసీపీ మహా పాత్ర, ఏసీపి లు బాలాజి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:46 AM