4న అమరావతి చిత్ర కళా వీధి ప్రదర్శన
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:25 AM
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన ఈనెల 4న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెం ట్రల్ జైలు రోడ్డులో ఆర్ట్స్

రాజమహేంద్రవరంలో నిర్వహణ : కలెక్టర్
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన ఈనెల 4న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెం ట్రల్ జైలు రోడ్డులో ఆర్ట్స్ కాలేజి నుంచి జీజీ హెచ్ వరకూ నిర్వహిస్తామని కలెక్టర్ పి.ప్రశాం తి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆమె మున్సిపల్ కమిషనర్ కేతన్గార్గ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకు డు ఎం.మల్లిఖార్జునరావుతో కలసి చిత్రకళా వీధి ప్రదర్శన పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడా రు. కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు తీసు కురావడం కోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వ ర్యంలో ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు ఏర్పా టు చేస్తున్నట్టు చెప్పారు. సుమారు 500 మం దికి పైగా కళాకారులు వస్తున్నట్టు చెప్పారు. రాజమహేంద్రవరంలోని దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీని వీధి ప్రదర్శన ద్వారా వచ్చే నిధు లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రదర్శనలో భాగ స్వామ్యం కోరుకునేవారు అమరావతి ఆర్ట్ ఫెస్టివల్.కామ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవా లని కమిషనర్ కేతన్గార్గ్ సూచించారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల రోడ్డులో అమరావతి వీధి ప్రదర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.