Share News

Tirupati stampede: ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించారు

ABN , Publish Date - Mar 18 , 2025 | 05:10 AM

జనవరి 8న జరిగిన తొక్కిసలాటపై తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను 40 నిమిషాలకుపైగా విచారించింది. తిరుపతి కలెక్టరేట్‌లోని కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఎదుట కలెక్టర్‌ విచారణకు హాజరయ్యారు.

 Tirupati stampede: ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించారు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై కలెక్టర్‌ను ప్రశ్నించిన కమిషన్‌

నేడు విచారణకు హాజరు కానున్న ఎస్పీ

తిరుపతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం నియమించిన న్యాయ విచారణ కమిషన్‌ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. జనవరి 8న జరిగిన తొక్కిసలాటపై తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ను 40 నిమిషాలకుపైగా విచారించింది. తిరుపతి కలెక్టరేట్‌లోని కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఎదుట కలెక్టర్‌ విచారణకు హాజరయ్యారు. తిరుపతి బైరాగిపట్టెడలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి తీసుకున్న చర్యల గురించి కమిషన్‌ చైర్మన్‌ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూలు ఆవరణలో పది కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్‌ వివరించారు. కౌంటర్ల వద్ద రెవెన్యూ శాఖ పరంగా ఎవరెవరిని, ఎక్కడెక్కడ నియమించారంటూ కమిషన్‌ ప్రశ్నించింది.


ఆయా అధికారులు, ఉద్యోగుల పేర్లు, వివరాలు, ఫోన్‌ నంబర్లతోపాటు వారిని విధులకు కేటాయిస్తూ కలెక్టర్‌ జారీచేసిన ఉత్తర్వులను కూడా అందజేయాలని కమిషన్‌ ఆదేశించింది. ఉదయం 10.50 గంటల నుంచి 11.33 గంటల వరకు కలెక్టర్‌ను ప్రశ్నించి అవసరమైన అంశాలను నమోదు చేసుకుంది. ఇప్పటి వరకూ మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, బాధితులు 53 మందిని కమిషన్‌ విచారించింది. కౌంటర్ల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి ప్రమేయం ఉన్న అధికారులు, ఉద్యోగులు తదితరులు మరో 150 మందిని విచారించే అవకాశముంది. కాగా, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మంగళవారం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ వారంలోనే టీటీడీ ఈవో, అదనపు ఈవో, సీవీఎస్వో తదితర ముఖ్య అధికారులను కమిషన్‌ విచారించనుంది.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 05:10 AM