Share News

విద్యార్థులందరూ బడిలో ఉండాలి: డీఈవో

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:26 AM

ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, వారందరూ బడిలో ఉండాలని డీఈవో శామ్యూల్‌ పాల్‌ అన్నారు.

విద్యార్థులందరూ బడిలో ఉండాలి: డీఈవో
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో శామ్యూల్‌ పాల్‌

గూడూరు, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, వారందరూ బడిలో ఉండాలని డీఈవో శామ్యూల్‌ పాల్‌ అన్నారు. మంగళవారం డీఈవో గూడూరు మండలంలో పర్యటించి డ్రాపౌట్‌గా ఉన్న విద్యార్థులు పాఠశాలల్లో చేరారా? లేదా? అని తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో డీఈవో విద్యర్థులతో సమావేశమై మాట్లాడారు. మండలంలో డ్రాపౌట్‌గా ఉన్న 48 మంది విద్యార్థులు తిరిగి ఆయా పాఠశాలల్లో చేరారని తెలిపారు.

Updated Date - Apr 16 , 2025 | 12:26 AM