బంగారు అంబారిపై ప్రహ్లాదరాయలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:46 AM
రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు అంబారిపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

మంత్రాలయం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు బంగారు అంబారిపై భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆదివారం ఉగాది పాడ్యమి శుభదినాన్ని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి, మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళ వాయిద్యాల మధ్య వెండి గజవాహనంపై స్వర్ణ అంబారిలో ప్రహ్లాదరాయలను అధిష్టించి పీఠాధిపతి మహామంగళహారతితో ఆలయ ప్రాంగణ ం చుట్టూ ఊరేగించారు.