Share News

ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన

ABN , Publish Date - Feb 06 , 2025 | 08:14 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరులో సమస్యలు, అభివృద్దికి రూ.1.12 కోట్ల నిధులు కేటాయించారు.

ABN ఎఫెక్ట్ : ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’కు అనూహ్య స్పందన
MLA Kotam Reddy Sridhar Reddy

నెల్లూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) నిర్వహించిన ‘అక్షరమే ఆయుధంగా - పరిష్కారమే అజెండా’ (Aksharame Aayudhanga Pariskarame Agenda)కు అనూహ్య స్పందన వచ్చింది. నెల్లూరు (Nellore) రూరల్‌లోని సౌత్ మోపూరు గ్రామంలో సమస్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) స్పందించారు. సౌత్ మోపూరులో సమస్యలు, అభివృద్దికి రూ.1.12 కోట్ల నిధులు కేటాయించారు. వాటికి గురువారం ఎమ్మెల్యే కోటంరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇచ్చిన హామీ మేరకు పదిరోజులు లోపే నిధులు కేటాయించారు.

ఈ వార్త కూడా చదవండి..

ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఎందుకంటే..


ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN-Andhrajyothy) నిర్వహిస్తున్న అక్షరం అండగా - పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఆంధ్రజ్యోతిలో సౌత్ మోపూరు గ్రామ సమస్యలపై పది రోజుల క్రితం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. సౌత్ మోపూరు గ్రామానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy), టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (TDP Leader Kotamreddy Giridhar Reddy), ప్రభుత్వ అధికారులు‌ తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను ఎమ్మెల్యే కోటంరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు అక్కడి ప్రజలు. స్మశానవాటికకు ప్రహారీ నిర్మించాలని... స్కూల్ ప్రహరిగోడ కొంత మేర కూలిపోయిందని.. శ్లాబ్ పెచ్చులూడిపోతుందని తెలిపారు. తమ గ్రామానికి హెల్పర్ లేరని.. వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదన్నారు.

ట్రాన్స్ ఫార్మర్ సరిలేక పశువులు చనిపోయాయని చెప్పారు. గ్రామంలో పలుచోట్ల వర్షపు నీరు నిలుస్తుందని.. దీని కారణంగా దోమల సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇప్పటికే విషజ్వరాలతో కొందరు మృత్యువాతపడ్డారని తెలిపారు‌. పొలాల్లోకి వెళ్లే రోడ్డులో గుంతల వల్ల వర్షాకాలం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. వ్యూవర్స్ కాలనీలో డ్రైనేజీ కాలువలు సరిలేవని ఎమ్మెల్యే ముందు గ్రామస్థలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. దీనిపై టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న అక్షరం అండగా - పరిష్కారమే అజెండా కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలకు నిధులు కేటాయించలేదని... సమస్యలన్నీ పేరుకుపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఏడు గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే తెలిపారు.


ఆంధ్రజ్యోతి ఇదొక కొత్త అధ్యాయం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దించడంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కీలకంగా వ్యవహారించాయనేది ప్రపంచమంతటి మాటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా, ప్రజా సమస్యలపై పోరాడటం సంతోషకరమన్నారు. ‘‘నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చా. విద్యార్ధి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నా. ప్రజల ఆధరణని మరువలేను. సౌత్ మోపూరు, ములుమూడి నాకు రెండు కళ్లు. పార్టీలకంటే నాకు సొంతంగా ఓట్లు ఎక్కువ. సౌత్ మోపూరు అంటే నాకు చాలా అభిమానం. ఇక్కడి ప్రజలు అగ్గిపెట్టె నుంచి అణుబాంబు వరకు, గ్రామం నుంచి ప్రపంచం వరకు ఏదైనా చెప్పగలరు‌. 13 ఏళ్ల పసిపిల్లవాడు కూడా నాకు ఫోన్ చేసి క్రికెట్ బ్యాట్, బాల్ కావాలని అడుగుతున్నారు’’ అని తెలిపారు.

సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సమస్యల కోసం ముందుగా రూ.కోటి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 8వ తేది లోపు... పదంటే పది రోజుల్లో శంకుస్థాపనలు జరుగుతాయన్నారు. ఎప్పటిలోగా పూర్తి అవుతాయో కూడా ముందుగానే చెబుతానని.. వీలైనంత త్వరగా పూర్తి చేస్తానని మాట ఇస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు - తాడిపర్తి రోడ్డు ఎంత ఘోరంగా ఉండేదో అందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోడ్డు పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయన్నారు. విద్యుత్తు సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

కాగా గత 22 ఏళ్ళ నుంచీ అక్షరమే ఆయుధంగా అటు ప్రజల సమస్యలను ఎత్తి చూపడంతో పాటు ఇటు అక్రమార్కులపై పోరు సాగిస్తున్న ఆంధ్రజ్యోతి తాజాగా తన అక్షయ తూణీరం నుంచీ మరో సరికొత్త అస్త్రం సంధిస్తోంది. ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ నినాదంతో జనం ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తేవడంతో పాటు వాటి పరిష్కారానికి కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది. సమస్యలు చుట్టుముట్టిన ప్రాంతాలలో సభలు నిర్వహించి జనవాణి వినిపించడం, దాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి యత్నించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. స్థానికులు తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వారధిగా ఆంధ్రజ్యోతి నిలవనుంది. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రయత్నించనుంది. మౌళిక సదుపాయాల పరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఆ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రజ్యోతి పిలుపునిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణ భారతం

కిక్కు లెక్క తేల్చేస్తారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 06 , 2025 | 08:14 AM