Best Award : రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి ఉత్తమ అవార్డు
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:47 AM
Best Award :ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (రాగోలు) 2023 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన అవార్డు లభించింది.

శ్రీకాకుళం రూరల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రానికి (రాగోలు) 2023 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ పరిశోధన అవార్డు లభించింది. వరి, మినుము, పెసరలో బ్రీడర్ విత్తనోత్పత్తి, జన్యుస్వచ్ఛత కలిగిన వరి విత్తనో త్పత్తి సేవలకు గాను ఈ అవార్డు వచ్చింది. గుంటూరు లాఫారంలో బుధవారం వ్యవసా యశాఖ కమిషనర్ ఢిల్లీరావు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆర్.శారదాజయలక్ష్మి నుంచి పరిశోధన కేంద్రం సంచాలకులు పీవీ సత్యనారాయణ, పి.ఉదయబాబు, కె.మధుకుమార్ ఈ అవార్డు అందుకున్నారు.