ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:40 PM
బడిఈడు పిల్లల ను ప్రభుత్వబడుల్లో చేర్పించాలని ఎంఈవో కె. అప్పారావు కోరారు. మంగళవారంముచ్చింద్ర, ధర్మపురం గ్రామాల్లో అప్పారావుతో పాటు ఎంఈవో-2 ఎస్.విశ్వనాధం పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల గురించి తల్లిదం డ్రులకు వివరించారు.

ఇచ్ఛాపురం, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లల ను ప్రభుత్వబడుల్లో చేర్పించాలని ఎంఈవో కె. అప్పారావు కోరారు. మంగళవారంముచ్చింద్ర, ధర్మపురం గ్రామాల్లో అప్పారావుతో పాటు ఎంఈవో-2 ఎస్.విశ్వనాధం పర్యటించి ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల గురించి తల్లిదం డ్రులకు వివరించారు. ముచ్చింద్రలో వేతనదారులకు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.
ఫరణస్థలం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవో బి. లావణ్య కోరారు. మంగళవారం మరువాడలో విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు.