సరియా జలపాతంలో ఇద్దరు యువకుల గల్లంతు
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:43 AM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.

విశాఖ పూర్ణామార్కెట్కు చెందిన వారుగా గుర్తింపు
అనంతగిరి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సరియా జలపాతం వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
విశాఖపట్నం పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు సరియా జలపాతాన్ని తిలకించేందుకు వచ్చారు. అయితే రెండో స్టెప్ జలపాతం అందాలను తిలకించి తిరిగి వెళుతుండగా.. మొదటి స్టెప్ డేంజర్ జలపాతం వద్దకు వచ్చేసరికి వారిలో వాసు, నరసింహ అనే ఇద్దరు యువకులు జారిపడి గల్లంతయ్యారు. వారిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సాయంత్రం కావడంతో స్థానికులు అనంతగిరి పోలీసులకు సమాచారం అందించారు. యువకులు గల్లంతైన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు.