Share News

ఓఎస్‌సీలను పాఠశాలల్లో చేర్పించండి

ABN , Publish Date - Apr 13 , 2025 | 01:19 AM

ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ (ఓఎస్‌సీ)ను వెంటనే పాఠశాలల్లో చేర్పిం చాలని ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖా ధికారి రమాజ్యోతి కోరారు. శనివారం మండలంలోని లచ్చయ్యపేట, చినభోగిలి మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు బూర్జ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.

ఓఎస్‌సీలను పాఠశాలల్లో చేర్పించండి
మాట్లాడుతున్న రమాజ్యోతి

సీతానగరం, ఏప్రిల్‌ 12 (ఆంధ్ర జ్యోతి): ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ (ఓఎస్‌సీ)ను వెంటనే పాఠశాలల్లో చేర్పిం చాలని ఇన్‌చార్జి జిల్లా విద్యాశాఖా ధికారి రమాజ్యోతి కోరారు. శనివారం మండలంలోని లచ్చయ్యపేట, చినభోగిలి మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలతో పాటు బూర్జ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓఎస్‌సీను వెంటనే స్కూల్‌లో జాయిన్‌ చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓఎస్‌సీ విద్యార్థులకు స్కూల్‌కు రెగ్యులర్‌గా వస్తున్నది లేనిది సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు సూరిదేముడు, మువ్వల వెంకటరమణ, ప్రధానోపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 01:19 AM