సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Apr 13 , 2025 | 01:16 AM
ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కార ధ్యేయంగా పభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి వినతులను సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమస్యను ఆలకించి సంబంధిత అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ఏదిఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.