Share News

Sunita Williams: త్వరలోనే భారత్‌కు వస్తా

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:34 AM

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ త్వరలోనే తన తండ్రి పుట్టిన భారత్‌ దేశాన్ని సందర్శించనున్నట్టు ప్రకటించారు. అక్కడి ప్రజలతో ఆమె తన అంతరిక్ష అనుభవాలు పంచుకుంటానని తెలిపారు

Sunita Williams: త్వరలోనే భారత్‌కు వస్తా

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 1: అంతరిక్షం నుంచి చూస్తే భారత్‌ అద్భుతంగా ఉందని నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ చెప్పారు. త్వరలో తన తండ్రి పుట్టిన భారత్‌కు వెళ్లి అక్కడి ప్రజలతో తన అంతరిక్ష అనుభవాలు పంచుకుంటానని తెలిపారు. తాజాగా ఆమె విల్మోర్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. అంతరిక్ష కేంద్రం నుంచి భారత్‌ ఎలా కనిపిస్తోంది? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆమె.. ‘‘అద్భుతంగా ఉంది. హిమాలయాల పైనుంచి మేం వెళ్లిన ప్రతిసారి విల్మోర్‌ ఫొటోలు తీశారు. ఆ పర్వతాలు అత్యద్భుతం. నా తండ్రి జన్మించిన దేశం వెళతాను. అక్కడి ప్రజలతో మమేకం అవుతాను. త్వరలో చేపట్టే యాక్సియమ్‌ మిషన్‌లో భారతీయుడు శుభాంశు భాగస్వామి కావడం అద్భుతంగా అనిపిస్తోంది. అతన్ని ఏదో సమయంలో కలుస్తాను. మా అంతరిక్ష అనుభవాలు అందరితో పంచుకుంటాం’’ అని విలియమ్స్‌ చెప్పారు. గుజరాత్‌కు చెందిన సునీతా విలియమ్స్‌ తండ్రి దీపక్‌ పాండ్యా.. 1958లో మెడిసిన్‌లో రెసిడెన్సీ శిక్షణకు, ఇంటర్న్‌షిప్‌ కోసం అమెరికాలోని ఓహియోకు వెళ్లారు. సునీతా విలియమ్స్‌ అక్కడే జన్మించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్

For Latest National News , National News in Telugu

Updated Date - Apr 02 , 2025 | 05:34 AM