Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్షా 3 సవాళ్లు
ABN , Publish Date - Jan 28 , 2025 | 10:02 PM
యమునలో కలిపినట్టు చెబుతున్న ఆ విషం ఏమిటో కేజ్రీవాల్ వెల్లడించాలని అమిత్షా సవాలు చేశారు. మరో సవాలు కూడా విసురుతూ, ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు ఢిల్లీలోకి యమునా జలాలను నిలిపివేయాలని ఇచ్చిన అధికారిక ఉత్వర్వులను ఢిల్లీ సీఎం చూపించాలని అన్నారు.

న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ యమునా నదలోకి కావాలనే పారిశ్రామిక వ్యర్థాలను వదులుతోందని, నదిలో విషం కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తోందని 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్షా విరుచుకుపడ్డారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని అన్నారు. ఢిల్లీ జల్బోర్డ్ నివేదికను 'ఆప్' బాస్ (కేజ్రీవాల్) ప్రజల ముందుంచాలని సవాల్ చేశారు.
Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ
కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్షా మాట్లాడుతూ, యమునలో కలిపినట్టు చెబుతున్న ఆ విషం ఏమిటో కేజ్రీవాల్ వెల్లడించాలని సవాలు చేశారు. మరో సవాలు కూడా విసురుతూ, ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు ఢిల్లీలోకి యమునా జలాలను నిలిపివేయాలని ఇచ్చిన అధికారిక ఉత్వర్వులను ఢిల్లీ ముఖ్యమంత్రి చూపించాలని అన్నారు.
''కేజ్రీవాల్ జీ... గెలుపు-ఓటమిలనేవి ఎన్నికల ప్రక్రియలో సహజం. మీరు అమాయకంగా నటిస్తూ, విషం కలిపారంటూ (యమునలో) హర్యానా ప్రభుత్వంపై ఆరోపణలు చేసి ఢిల్లీ ప్రజలను భయపెట్టాలని అనుకుంటున్నారు. ఇంతకంటే నీచ రాజకీయాలు ఉండవు'' అని అమిత్షా ఘాటు విమర్శలు చేశారు. ఆప్ నేతలంతటి అబద్ధాల కోరులు ఉండరని, వాగ్దానాల భంగంలో కేజ్రీవాల్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని అన్నారు. ఆప్దా (విపత్తు) ప్రభుత్వాన్ని వదిలించుకోవడానికి ఢిల్లీ ప్రజలకు ఫిబ్రవరి 5వ తేదీ గొప్ప అవకాశమని చెప్పారు. కల్గాజీ నియోజకవర్గంలో రమేష్ బిధూరిని గెలిపించాలని కోరారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
Mauni Amavasya: మౌని అమావాస్య.. పితృ దోషం నుండి ఇలా బయటపడండి..
Kumbh Mela 2025: మహా కుంభమేళాను 15 రోజుల్లో ఎంత మంది సందర్శించారో తెలుసా..
Read More National News and Latest Telugu News