Share News

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

ABN , Publish Date - Apr 15 , 2025 | 07:51 PM

రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

శ్రీనగర్: ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వంలో ప్రాంతీయ అనుసంధానం, పర్యాటకానికి పెద్దపీట వేస్తున్న భారత రైల్వే శాఖ కొత్తగా వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ (Vaishno Devi Katra To Srinagar) వందేభారత్ (Vande Bharat) ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెస్తోంది. జమ్మూకశ్మీర్ పర్యటించే వారికి మరింత విలువైన సేవలను ఈ హైస్పీడ్ రైలు అందించనుంది.

Muda Case: సీఎంకు ఎదురుదెబ్బ.. లోకాయుక్త పోలీసుల విచారణ కొనసాగింపు


రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. అంజి ఖాడ్ వంతెన, చినాబ్ వంతెన పూర్తి కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌కు రైలు సేవల అనుసంధానమవుతున్నాయి.


కాగా, వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్య తొలిసారి నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న ప్రారంభించనున్నారు. 272 కిలోమీటర్ల ఈ రైల్వే లేన్ ఏర్పాటుతో కేవలం 3 గంటల్లో గమ్యం చేరవచ్చు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణనికి 6 నుంచి 7 గంటలు పడుతోంది. విమానమార్గంలో చేరేందుకు గంట పడుతోంది. ఇప్పడు వందేభారత్ రైలుతో వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.


ఇవి కూడా చదవండి..

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 15 , 2025 | 07:55 PM