అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. క్షతగాత్రులకు హోంమంత్రి అనిత పరామర్శ
ABN, Publish Date - Apr 14 , 2025 | 07:46 AM
అనకాపల్లి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం నాడు భారీ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోం మంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్ పరామర్శించారు.

అనకాపల్లి జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం నాడు భారీ విస్ఫోటం సంభవించింది.

ఈ ఘటనలో 8 మంది కార్మికులు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమయంలో కర్మాగారంలో 15 మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు, స్థానికులను అడిగి హోంమంత్రి అనిత తెలుసుకున్నారు.

ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను హోంమంత్రి అనిత పరామర్శించి దైర్యం చెప్పారు.

ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హోంమంత్రి అనిత తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం కొంతమందిని కేజీహేచ్కు తరలిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Updated at - Apr 14 , 2025 | 07:57 AM