Share News

ఇంగ్లండ్‌ టూర్‌లో మూడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:19 AM

వరుసగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల చేతిలో భారత జట్టు టెస్టు సిరీ్‌సలను కోల్పోయి విమర్శలపాలైంది. ఇక ఐపీఎల్‌ ముగిశాక 5 టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా...

ఇంగ్లండ్‌ టూర్‌లో మూడు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు

వరుసగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల చేతిలో భారత జట్టు టెస్టు సిరీ్‌సలను కోల్పోయి విమర్శలపాలైంది. ఇక ఐపీఎల్‌ ముగిశాక 5 టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. జూన్‌ 20న మొదలయ్యే ఈ సుదీర్ఘ సిరీ్‌సకు పక్కా వ్యూహంతో బరిలోకి దిగాలని బీసీసీఐ భావిస్తోంది. ఈనేపథ్యంలో ఇంగ్లండ్‌ లయన్స్‌తో 3 ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడించాలనుకుంటోంది. నాలుగేసి రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్‌ల ద్వారా భారత ఆటగాళ్లకు అక్కడి వాతావరణం, పిచ్‌లపై చక్కటి అవగాహన ఏర్పడగలదని బోర్డు భావిస్తోంది. మే 25 తర్వాతే ఆటగాళ్లు ఇంగ్లండ్‌ వెళతారు. అయితే వామప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Updated Date - Jan 17 , 2025 | 05:19 AM