ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:48 AM
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నది. అన్నిరంగాల్లో ఏఐ వినియోగం అనివార్య మైంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏఐని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థుల్లో యేటా అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నది. అన్నిరంగాల్లో ఏఐ వినియోగం అనివార్య మైంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఏఐని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థుల్లో యేటా అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోవడం గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు కృత్రిమ మేఽథ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. ముందుగా ప్రాథమిక పాఠశాలల్లో చదివే వారిలో అభ్యసన సామర్థ్యాలు పెంపాందించేందుకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో పాఠాలు బోధించడం ప్రారంభించారు. విద్యార్థులు తెలుగు బాగా చదవడం, గణిత అంశాల్లో పట్టు సాధించేలా కృత్రిమ మేఽథ సాయంతో ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా 50 మం దికి పైగా విద్యార్థులు గల 20 ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు. వీటిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరుకు చెందిన ఏక్-స్టెప్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో మన రాష్ట్రంలో కూడా కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో విద్యా బోధన ప్రారం భించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏఐని ఒక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టి క్రమంగా 50 మంది వరకు గల మరిన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా బోధన ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
జిల్లాలో 20 పాఠశాలల గుర్తింపు..
జిల్లాలో 20 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో జూలపల్లి మండలం తేలుకుంట, మంథని మండలం కన్నాల, ఎక్లాస్పూర్, మంథని బాలికల పాఠశాల, రామగుండం మండలంలోని గాంధీ పార్కు ఉర్దూ మీడియం పాఠశాల, తెలుగు మీడియం పాఠశాల, మల్యాలపల్లి, రామగుండం పాఠశాలలు, కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం, పెద్దపల్లి మండ లం మారేడుగొండ, రంగాపూర్, ఎలిగేడు మండలం సుల్తాన్పూర్, పాలకుర్తి మండలం కన్నాల, బసంత్న గర్, ఓదెల మండలం కొలనూర్, ధర్మారం మండలం కొత్తూర్, నర్సింహులపల్లి, ముత్తారం మండలం ఖమ్మం పల్లి, అంతర్గాం మండలం అంతర్గాం టీటీఎస్, రామ గుండం మండలం నాగేపల్లి పాఠశాలలు ఉన్నాయి. ఏఐ బోధించేందుకు పలువురు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఫండమెంటల్ లిట్రసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) ప్రకారం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు మార్చి 15వ తేదీ నుంచి విద్యాబోధన మొదలు పెట్టారు.
విద్యాసామర్థ్యాలు పెంచడమే లక్ష్యం..
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదవడం, రాయడం గణితం సరిగా చేయక పోవడం వంటివి జరుగుతున్నాయి. అలాంటి విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి విద్యా సామర్థ్యాలను పెంపొందించడానికి ఏఐ ద్వారా విద్యా బోధన చేస్తున్నారు. ముఖ్యంగా వెనకబడిన విద్యార్థులు ఈ టూల్స్ను ఉపయోగించుకొని స్వయంగా విద్యార్థులే తెలుగు, ఇంగ్లీష్ భాషలో అక్షరాల గుర్తింపు, సరళ పదాలు, వారి స్థాయిని బట్టి పదాలను చదవడం, రాయడం, గణితంలో సంఖ్యలు రాయడం, కూడిక నుంచి మొదలుకొని భాగాహారం వరకు విద్యార్థులు స్వయంగా నేర్చుకోవడానికి ఏఐ దోహదపడుతుంది. దీని ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటికి తోడుగా ఎఎక్స్టెల్ పేరుతో ఇంటెలిజెన్స్ విద్యను అందించనున్నారు. ఫస్ట్ లెవెల్లో డిస్కవరిలో ఏఐ పిల్లల శక్తి సామర్థ్యాలు తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. దృశ్య, శ్రవణం ద్వారా జవాబు కూడా చెబుతుంది. ఏఐలో ఎక్సైడ్ ఫ్లో ఫౌండేషన్ ఏఐ లెర్నింగ్ టూల్స్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ (ఏఎల్ఎల్), అసిస్టెడ్ మ్యాథమెటిక్ లెర్నింగ్ (ఏఎంఎల్) ఇన్స్టాల్ చేశారు. ఎఫ్ఎల్ఎన్ ద్వారా నేర్చుకున్న అంశాలను కంప్యూటర్ ముందు తప్పుగా చదివితే లోపాలను గుర్తిస్తుంది. ప్రధానంగా 3, 4, 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో చదుపుల్లో వెనక బడిన వారిలో విద్యార్ధుల సంఖ్యకనుగుణంగా 5, 10, 15 మందిని ఒక్కో బ్యాచ్గా విభజించారు. ఒక్కో బ్యాచ్కు తెలుగు, గణిత అభ్యాసాలపై 20, 40 నిమిషాల పాటు కృత్రిమ మేథ పాఠ్యాంశాల బోధన చేస్తున్నారు. అభ్యా సానికి సంబంధించిన అంశాల్లో 70 శాతానికి పైగా సరైన సమాధానాలు సాధిస్తేనే మరో పాఠ్యాంశం నేర్చు కునేందుకు అవకాశం ఉంటుంది. అంతకంటే తక్కువగా మార్కులు వస్తే ఆ పాఠ్యాంశాన్ని మరోసారి అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఏఐ విద్యాబోధనను ఏక్-స్టెప్ సంస్థ పర్యవేక్షించి లోపాలను సరిదిద్దుతుంది. అలాగే ఏఐ ద్వారా వచ్చే ఫలితాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించనున్నది.