Share News

ఖజానాకు కళ..

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:55 AM

ఆస్తి పన్నుల వసూలు రికార్డుల్లో మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో 99 శాతంతో ప్రథమంగా నిలిచింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామ పంచాయతీల్లో సిబ్బంది పన్నుల వసూల్లను లక్ష్యానికి చేరువలో పూర్తి చేయడంతో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల ఖజానా కళకళలాడుతోంది. జిల్లాలో మార్చి 31 లోపునే నిర్దేశించిన లక్ష్యంలో 99 శాతం పూర్తిచేశారు.

ఖజానాకు కళ..

- పన్నుల వసూళ్లలో మరోసారి రికార్డు..

- రాష్ట్ర స్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమం

- గ్రామపంచాయతీల్లో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.7.21 కోట్లు

- ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వసూలు రూ.7.12 కోట్లు...

- మిగిలిన బకాయిలు రూ.9.15 లక్షలు

- రెండు మున్సిపాలిటీల్లో లక్ష్యం రూ.10.39 కోట్లు.. వసూలు రూ.9.60 కోట్లు

- 8 మండలాల్లో వంద శాతం వసూలు పూర్తి

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

ఆస్తి పన్నుల వసూలు రికార్డుల్లో మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్ర స్థాయిలో 99 శాతంతో ప్రథమంగా నిలిచింది. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 260 గ్రామ పంచాయతీల్లో సిబ్బంది పన్నుల వసూల్లను లక్ష్యానికి చేరువలో పూర్తి చేయడంతో గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల ఖజానా కళకళలాడుతోంది. జిల్లాలో మార్చి 31 లోపునే నిర్దేశించిన లక్ష్యంలో 99 శాతం పూర్తిచేశారు. పన్నుల వసూళ్లలో గ్రామ పంచాయతీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకొని ఆదర్శంగా నిలిచింది. గ్రామపంచాయతీ పాలకవర్గాలు లేకపోయినా ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం.

ఫ జిల్లాలో 99 శాతం పూర్తి..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామ పంచాయతీల పరిధిలో పన్నుల లక్ష్యాన్ని 99 శాతం పూర్తి చేశారు. జిల్లాలోని 12 మండలాల్లోని గ్రామపంచాయతీల్లో ఆస్తి పన్నుల్లో పాత బకాయిలతో కలిపి రూ.7 కోట్ల 21 లక్షల 42 వేల 291 వసూలు లక్ష్యం ఉండగా, రూ.7 కోట్ల 12 లక్షల 27 వేల 901 వసూలు చేశారు. కేవలం రూ.9 లక్షల 15 వేల 390 మాత్రమే బకాయిలు ఉన్నాయి. జిల్లాలో 12 మండలాల్లో 8 మండలాలు వంద శాతం వసూలు పూర్తి చేశారు. వంద శాతం లక్ష్యం సాధించిన మండలాల్లో చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్‌, రుద్రంగి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, వేములవాడ రూరల్‌ మండలాలు ఉన్నాయి. 99 శాతంలో బోయినపల్లి, ఇల్లంతకుంట మండలాలు ఉండగా తంగళ్లపల్లి 98 శాతం, గంభీరావుపేట 91 శాతంతో ఉన్నాయి. పన్నుల వసూళ్లలో బోయినపల్లి మండలంలో 23 గ్రామపంచాయతీల్లో రూ.51,65,364కు రూ.51,18,846 వసూలు చేశారు, చందుర్తి మండలంలో 19 గ్రామపంచాయతీల్లో రూ.49,54,330కు వసూలు రూ.44,96,966, ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీల్లో రూ.53,52,978కు వసూలు రూ.52,74,624 గంభీరావుపేట మండలంలో 22 గ్రామపంచాయతీల్లో రూ.70,02,546కు వసూలు రూ.63,88,255, కోనరావుపేట మండలంలో 28 గ్రామ పంచాయతీల్లో రూ.44,82,537కు వసూలు రూ.44,96,966, ముస్తాబాద్‌ మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో రూ.1,07,02,265కు వసూలు రూ.1,06,73,103, రుద్రంగి మండలలో పది గ్రామ పంచాయతీల్లో రూ.29,59,690కు వసూలు రూ.29,47,630, తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామ పంచాయతీల్లో రూ.88,33,109కు వసూలు రూ.86,52,434, వీర్నపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో రూ.18,40,706కు వసూలు రూ.18,42,898, వేములవాడ మండలంలో 11 గ్రామ పంచాయతీల్లో రూ.71,70,096కు వసూలు రూ.71,71,250, వేములవాడ రూరల్‌ మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో రూ.24,70,871కు వసూలు రూ.24,71,668, ఎల్లారెడ్డిపేట మండలంలో 26 గ్రామపంచాయతీల్లో రూ.1,12,08,799కు రూ.1,12,27,998 పన్నులను వసూలు చేశారు. బకాయిల్లో రూ.9లక్షల 15 వేల 390 మిగిలాయి. ఇందులో రెగ్యులర్‌ బకాయిలు రూ.34,220 ఉండగా, పాత బకాయిలు రూ.8లక్షల 81వేల170 ఉన్నాయి.

ఫ మున్సిపాలిటీల్లో రూ.9.60 కోట్లు వసూలు

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో అస్తి పన్నుల వసూలుకు డిమాండ్‌ మేరుకు ముందుకు వెళ్లారు. రెండు మున్సిపాలిటీల్లో రూ.10.39 కోట్ల పన్నుల వసూళ్లు లక్ష్యం కాగా, రూ.9.60 కోట్లు వసూలు చేశారు. ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో 23,487 ఇండ్లకు సంబంధించి రూ.6.32 కోట్ల లక్ష్యానికి రూ.6.13 కోట్లతో 96.99 శాతంతో ముందంజలో ఉన్నారు. వేములవాడ మున్సిపాలిటీలో రూ.4.07 కోట్ల లక్ష్యం కాగా, రూ.3.47 కోట్లు వసూలు చేసి 85.14 శాతంతో నిలిచారు.

Updated Date - Apr 03 , 2025 | 01:55 AM