Share News

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌..

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:32 PM

మత సామర స్యానికి, శాంతికి, ఐక్యతకు ప్రతీకగా రం జాన్‌ పండుగ నిలుస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పేర్కొ న్నారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌..
ముస్లిం పెద్దలతో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌/మంచిర్యాలక్రైం, మార్చి31 (ఆంరఽధజ్యోతి) మత సామర స్యానికి, శాంతికి, ఐక్యతకు ప్రతీకగా రం జాన్‌ పండుగ నిలుస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పేర్కొ న్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మ సీదుల్లో మైనార్టీలు అధిక సంఖ్యలో పా ల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పా ల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ యన మాట్లాడుతూ పవిత్రమైన రంజా న్‌పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని హిందూ, ముస్లింలు అంద రూ కలిసి మెలిసి ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడపించేందుకు ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాం గ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఫరంజాన్‌ మాసం సందర్భంగా 30 రో జుల పాటు ఉపవాస దీక్షలు చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నీలకంఠేశ్వరావు పేర్కొన్నారు. సో మవారం రంజాన్‌ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పురాణ మసీదులో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సో దరులకు మిఠాయిలు తినిపించారు. మై నార్టీ సంఘం నాయకులు అబీద్‌, మత పెద్ద ఇక్రముల్‌ హక్‌, ఎండీ షకీల్‌, సోహె ల్‌ఖాన్‌, తాజోద్దీన్‌, పాల్గొన్నారు.

నస్పూర్‌ : పట్టణంలో సోమవారం రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముస్లిం లు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. సీసీ సీ సుందరయ్య కాలనీ, హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఈద్గాల వద్ద ఉదయం నమా జ్‌ చేసి రంజాన్‌ పండగ శుభాకాంక్షలను ఒక్కరినొకరు తెలియజేసుకున్నారు. వివిధ రాజకీయ పార్టీ నేతలు ముస్లింలకు శుభా కాంక్షలు చెప్పారు.

Updated Date - Mar 31 , 2025 | 11:32 PM