Share News

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

ABN , Publish Date - Apr 10 , 2025 | 02:01 PM

రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..
CM Revanth Reddy

రంగారెడ్డి జిల్లా: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police School) ఇది ప్రతీ పోలీస్ సిబ్బందికి అత్యంత ముఖ్యమైనదని, ఎన్నికల మేనిఫెస్టోలోనే (Elections Manifesto) పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పేర్కొన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా, మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆనాడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయని, నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరిందన్నారు. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారని అన్నారు.

Also Read..: హాలిడే ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ భగ్నం..


చంద్రబాబు ఒక బ్రాండ్...

ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయని, ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని, అలాగే ఇవాళ తాను క్రియేట్ చేసిన తన బ్రాండ్ ‘యంగ్ ఇండియా’ మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్‌ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నామని అన్నారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్ అని, నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామన్నారు.


దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీ..

ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్‌గా నియమించుకున్నామని, ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉందని, దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్సారు. ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందన్నారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి… ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని.. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. పోలీస్ స్కూల్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యతని.. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్‌కు ఆర్ధిక సాయం అందించాలని కోరారు. పోలీస్ స్కూల్ కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలని.. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందుల అభివృద్ధి పేరుతో జగన్ మోసం

ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

టీడీపీ కార్యకర్తపై కేసు.. మరికాసేపట్లో అరెస్టు..

For More AP News and Telugu News

Updated Date - Apr 10 , 2025 | 02:01 PM