బీసీ రిజర్వేషన్లకు అనుమతివ్వండి
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:46 AM
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతివ్వాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ను రాష్ట్ర మంత్రులు కోరారు.

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతివ్వాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ను రాష్ట్ర మంత్రులు కోరారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవి తదితరులు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కేంద్ర మంత్రిని గురువారం కలిసి ఓ వినతి పత్రం అందజేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.