Secunderabad: లింగంపల్లి రైల్వేస్టేషన్లో సకల సదుపాయాలు కల్పిస్తాం..
ABN , Publish Date - Feb 26 , 2025 | 08:49 AM
లింగంపల్లి రైల్వేస్టేషన్(Lingampalli Railway Station)లో సకల సదుపాయాలు కల్పిస్తామని రైల్వే సౌత్సెంట్రల్ సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు.

సికింద్రాబాద్: లింగంపల్లి రైల్వేస్టేషన్(Lingampalli Railway Station)లో సకల సదుపాయాలు కల్పిస్తామని రైల్వే సౌత్సెంట్రల్ సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. రైల్వేస్టేషన్లలో సమస్యలు తెలుసుకునేందుకు ఆయన 50మంది అధికారులు, సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం లింగంపల్లి రైల్వేస్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్ రామస్వామియాదవ్ లింగంపల్లి స్టేషన్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: తప్పిన ప్రాణాపాయం.. అయినవారు లేకున్నా అండగా నిలిచిన పోలీసులు
ప్లాట్ఫాం నంబర్-1 వైపు పార్కింగ్ సమస్య ఉందని, అదేవిధంగా లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. మరుగుదొడ్లు, ప్రస్తుతం ఉన్న ఎస్కలేటర్లు ఏవిధంగా పనిచేస్తున్నాయి, తదితర సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో లింగంపల్లి రైల్వేస్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: CVI: ఊబకాయానికి టీకాతో చెక్?
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ ప్రతీ నిర్ణయం బూమరాంగే
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
Read Latest Telangana News and National News