ఎస్‌బీఐ బ్యాంక్‌కు తాళం వేసిన ఖాతాదారులు

ABN, Publish Date - Apr 04 , 2025 | 09:32 PM

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ)కు కొందరు ఖాతాదారులు తాళం వేసి, బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. బ్యాంక్‌లో గత సంవత్సరం నవంబర్ 19న దుండగులు చోరీకి పాల్పడి 497 మందికి చెందిన సుమారు 16 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లారు. తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా.. బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు.

ఆ క్రమంలో వారు బ్యాంకు ఎదుట పలు మార్లు ఆందోళనకు దిగారు. ఇటీవల ఏప్రిల్ 4వ తేదీన చెల్లింపులు చేపడతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఇవాళ బాధితులు బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. దీంతో సోమవారం రావాలంటూ వారికి అధికారులు సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. బ్యాంకు అధికారులు, పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకుండా బ్యాంకు ఎదుటే కూర్చున్నారు. బంగారం తిరిగి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు.

Updated at - Apr 04 , 2025 | 09:33 PM