Borugadda Anil Kumar: బోరుగడ్డ అనిల్పై మరో కేసు.. రాజమండ్రి జైలుకి గుంటూరు పోలీసులు
ABN, Publish Date - Mar 12 , 2025 | 10:09 AM
బోరుగడ్డ అనిల్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు వెళ్లారు.ఫాస్టర్ను బెదిరించిండంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్పై అనిల్ను అదుపులోకి తీసుకోనున్నారు.

రాజమండ్రి: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కోసం గుంటూరు పోలీసులు రాజమండ్రి జైలుకు బుధవారం నాడు వెళ్లారు. ఫాస్టర్ను బెదిరించడంతో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పీటీ వారెంట్పై గుంటూరు పోలీసులు అనిల్ను అదుపులోకి తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు రాజమండ్రి జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. దీంతో రాజమండ్రి జైలు నుంచి అనిల్ను అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
కాగా.. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే.. చెన్నై నుంచి ఫ్లైట్లో రాజమండ్రి వచ్చి సెంట్రల్ జైల్లో లొంగిపోవాలని ఆదేశించింది.మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. ఈ రోజుతో బోరుగడ్డ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. రాజమండ్రి జైలులో లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పైవిధంగా స్పందించింది.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 12 , 2025 | 10:11 AM