Home » 2024
సోమలరాజు ఫౌండేషన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులోని ఆ ఫౌండేషన కార్యాలయంలో శనివారం నగరానికి ఓం సంగీత నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్యకు భారత సేవారత్న పురస్కారం, ఆమె శిష్యబృందం కుందనిక, సమృద్ది, లాస్య, భార్గవి, తేజోవతి, శిరీష, రాధ, చంద్రకళ, సుబ్బలక్ష్మి, అనురాధలకు నాట్యమయూరి పురస్కారాలను ఫౌండేషన నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి, సోమలరాజుల చేతులమీదుగా అందజేసి సత్కరించారు.
సాయి ట్రస్టు ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని శ్రీ7 కన్వెన్షన హాల్లో శనివారం శ్రీవారి సేవలో ఒకరోజు పేరుతో వెంకటేశ్వర వైభవం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవంతో పాటు వివిధ సేవలను నిర్వహించారు. ఈనేపథ్యంలో శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం స్నపన తిరుమంజనం, అష్టదళ పద్మార్చన, తోమాల సేవ, పుష్పయాగం, తిరుప్పాడ సేవ, ఏడుశనివారాల వ్రతం, హనుమంత వాహన సేవ, నిర్వహించారు.
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజక వర్గాల్లోని ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కొన్నేళ్లుగా నెలకొన్న ప్రయాణ కష్టాలు త్వరలో తీర నున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రోడ్లన్నీ చాలా అధ్వానస్థితికి చేరుకుని ప్రజ లు చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో హెచ్చెల్సీపై కణేకల్లు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది.
అనంతపు రం ఆర్డీటీ మైదానాల్లో జరుగుతున్న దులీప్ట్రోఫీ క్రికెట్ పోటీ లలో మూడో రోజు శనివారం మూడు సెంచరీలు నమోద య్యాయి. ఇం డియా-ఎ జట్టు రెండో ఇన్నింగ్స్ వికెట్ నష్టా నికి 115 పరు గులతో ఆట ప్రారంభించి.. 98 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇండియా- డి జట్టు 488 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ పారంభించి, మూడో రోజు ఆటముగిసే సమయానికి 19 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది.
డీఈఓను బెదిరిస్తున్నారా..? విద్యాశాఖను కుల రాజకీయాలు శాసిస్తున్నాయా? కుల కుంపట్లు పెట్టుకున్న కొందరు ఎంఈఓలు వివాదాల్లో చిక్కుకుని రోడ్డుపైకి వచ్చారా...?, కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు, నిరసనలను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. డీఈఓను కొందరు ఎంఈఓలు, మరికొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని శుక్రవారం పెట్టిన ఓ పోస్టు వైరలైంది. ...
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. ఈనెలాఖరు దాకా ప్రత్యామ్నాయ పంటలు సాగుకు అదును సమయం ఉంది. ఎర్రనేలల్లో పంటలు సాగు చేయడానికి రైతులు అన్ని పనులు పూర్తి చేసి, వాన కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలోని యాడికి మండలంలో పచ్చజొన్న, పెద్దవడుగూరు మండలంలో కొర్ర, పత్తి పంటలు సాగు చేశారు. మిగతా ప్రాంతాల్లో వర్షం వస్తే ఉలవ సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నా రు. అయితే ...
పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసులు గురువారం తెలిపారు. పెనుకొండ నగర పంచాయతీ రోడ్డు నుంచి కోనాపురం వెళ్లే రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇటీడీపీ మడకశిర రహదారిలోని ఎగువ ప్రాంతం నుంచి మురుగు కాలువపై కల్వర్టు బ్లాక్ అయి మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.
ప్రజలు కష్టాల్లో ఉండి బాధలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందే వ్యక్తి జగన అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. అయితే కష్టా ల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రబాబును చూసి జీర్ణించుకోలేక శిశుపాలుడితో పోల్చడం జగన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వారు గురువారం స్థానిక ఆర్ అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
ఎర్ర మట్టికోసం ప్రభుత్వ భూములను గుల్ల చేస్తున్నారు. అధికారుల అండతో చెలరేగిపోతున్నారు. గుత్తి మండల పరిధిలోని మామిళ్ళచెరువు కొండలు, ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. వైసీపీ హయాంలో మట్టి మాఫియా దెబ్బకు మామిళ్లచెరువు కొండ కరిగిపోయింది. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడు, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దందాకు తెరలేపారు. గుత్తి పట్టణంలోని ...
వరదలతో అతలాకుతలైన విజయవాడ ప్రాంత వాసులను ఆదుకుందామని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. పట్టణంలోని రహమతపురం సర్కిల్, బాలాజీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, మెయిన బజార్లలో బుధవారం వరద బాధితుల సహయార్థం వారు విరాళాలు సేకరించారు. రూ.30270 వసూలు చేశామని ఈ మొత్తాన్ని వరదబాధితుల సహయ నిధికి అందజే స్తామన్నారు.