Home » 2024
ప్రతి ముసిం పవిత్ర ఖురానను పఠించి, అందులోని సా రాంశాన్ని అర్థం చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకో వాలని సయ్యద్ అమీర్ మసూది సాహెబ్ పేర్కొ న్నారు. జిల్లాకేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం తెహరీక్ ఫైజానే ఉమర్ ఫారుక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ వార్షిక సున్నీ ఇజ్తేమాకు ఉత్తర ప్రదేశకు చెందిన సయ్యద్ మసూది సాహెబ్ ముఖ్య అ తిథిగా హాజరై ఆధ్యాత్మిక బోధనలు చేశారు
ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవసాయానికి, గృహాలకు మెరు గైన విద్యుత సౌకర్యం కల్పించాలని విద్యుత శాఖా ధికా రులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నసన కోట పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ స్కీం పనులను ఆమె ఆదివారం విద్యుత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
మార్కెట్కు వచ్చే రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్ట వద్దని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్ర సాద్ సూచించారు. ఆయన ఆదివారం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో జరుగుతున్న పశువుల సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. మార్కెట్లో సుంకం వసూలు, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు.
పేరు గొప్ప - ఊరు దిబ్బ అన్న చందంగా నార్పల మేజరు పం చాయతీ పరిస్థితి ఏర్పడింది. నార్పలలో కనీసం వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నార్పల మేజరు పంచాయతీలో 18 వార్డులుండగా, అందులో 1750 వీధిలైట్లు ఉన్నా యి. అయితే 40రోజులుగా దాదాపు 400కు పైగా వీధి లైట్లు చెడిపోయాయి.
ఉమ్మడి అనంతపురం జిల్లాల రైతాంగానికి ఎంతో ఉపయోగపడే హెచ్చెల్సీ ఎగువ కాలవ ఆధునికీకరణకు రూ. 500 కోట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు జగదీష్ డిమాండ్ చేశా రు. శనివారం సీపీఐ కార్యాలయంలో ఆయన జిల్లా కార్యదర్శి జాఫర్, ఇతర నేతల తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ హరిహరసుత అ య్యప్పస్వామి దేవాలయం లో శనివారం సాయంత్రం స్వామివారి మహాపడిపూజోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉద యం మూలవిరాట్కు విశే ష పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆవరణలోని వేదికపై గణపతి, లక్ష్మి, అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులను ఉంచి, ప్రత్యేక అలంకరణ చేశారు.
నిరు పేదలకు టీడీపీ అండగా ని లుస్తుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు పొందిన పలువురు నిరుపేదలకు మంజూరైన ముఖ్యమంత్రి సహా య నిధి సొమ్మును ఆమె శనివారం అందజేశారు.
మండలంలోని కక్కలపల్లి ప్రధానరోడ్డు ప్యాచ వర్కు లు ప్రారంభమయ్యాయి. గత రెండురోజులుగా ము మ్మరంగా సాగుతున్న పనులు తుది దశకు చేరుకు న్నాయి. అయితే ప్యాచ వర్కులను చూసి పడే ఆనం దాన్ని రోడ్డుపై కనిపిస్తున్న గుంతలు ఆవిరి చేస్తున్నా యి. కక్కలపల్లి ప్రధాన రోడ్డు ప్యాచ వర్కుల ఆల స్యంతో కంకర తేలి వాహనదారులు, ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని ఈ నెల 19న ‘ఏం రోడ్డప్పా ఇది’ అనే శీర్షికన ఆంధ్ర జ్యోతి కథనం ప్రచురిం చింది.
ఇంటర్ చదువుతున్న ఓ బాలికకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఉన్నట్లుండి కాలేజీ మాన్పించారు. పెళ్లి ఇష్టం లేదని, చదువుకుంటానని ఆమె చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోలేదు. దీంతో ఆ బాలిక డయల్ 100కు ఫోన చేసింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. మైనర్కు వివాహం చేయొద్దని, బాగా చదివించాలని సూచించింది. తమకూ చదివించాలనే ఉందని, కానీ కాలేజీకి వెళ్లొచ్చే సమయంలో తమ కూతురుకు ఇబ్బందులు ...
హనుమాన చాలీసా ప్రచార సమితి, పవన యువజన సేవా ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీన భారీ ఎత్తున హనుమాన చాలీసా పార్యాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని లలితకళా పరిషతలో బుధవారం నుంచి నిర్వహిస్తున్న సన్నాహక కార్యక్రమం గురు వారం ఘనంగా ముగిసింది.