Home » AICC
మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ కేంద్ర హై కమాండ్ది ఒక దారి... సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది మరో దారిలా ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(Harish Rao) అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీమ్ లీడర్గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం నాడు ఓ పత్రికా ప్రకటనలో సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వై నాట్ 175 కొద్ది రోజుల క్రితం జగన్ నోట గట్టిగా వినిపించిన మాట.. రానురాను స్వరం మారింది. సంఖ్య మారుతోంది. దీనికి ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒకటైతే.. రెండోది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. జగన్ నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తోందంట. తాజాగా జగన్కు చెల్లి షర్మిల (Sharmila) భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్(Congress)లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు వైఎస్.షర్మిల.
ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ (Congress) సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశం అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు.
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో సమావేశమైంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికతో పాటు.. పార్టీ మేనిఫెస్టో(Manifesto)పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రను అభినందిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేయనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ అభ్యర్థులపై సోమవారం కాంగ్రెస్ ఫైనల్ కసరత్తు చేయనుంది. ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగతా 13 స్థానాల అభ్యర్థుల విషయంలో ఈరోజు కీలక నిర్ణయం తీసుకోనుంది.
Andhrapradesh: రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ప్రధాని మోదీ దుర్మార్గపు ఆలోచనలకు అండగా ఉన్నారని ఏపీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శలు గుప్పించారు. గురువారం ఆంధ్రరత్నభవన్లో ఏపీపీసీ ఎస్సీ విభాగం నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుడిని హత్య చేసి ఇంటికి మూటకట్డి తీసుకెళ్తే ఎమ్మెల్సీపై చర్యలు లేవని.. పైగా బెయిల్ ఇప్పించి జగన్ పక్కన కూర్చో పెట్డుకున్నారని మండిపడ్డారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (గురువారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. రేపు తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనుంది. ఒకటి రెండు రోజుల్లో మెజారిటీ లోక్సభ స్థానాలను ఏఐసీసీ ప్రకటించనుంది.
Andhrapradesh: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనమని ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రిక తప్పిదమన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతి మయం, మాఫియా మయం అవుతుందని.. కాబట్టి తరలించ వద్దన్నారు.
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.