Home » Andhra Pradesh Politics
జగన్ ప్రభుత్వం పేదలపై కపట ప్రేమ చూపుతోంది. సంక్షేమ పథకాలకు జగన్ బటన్ నొక్కి రెండు మూడు నెలలు అయినా ఇప్పటికీ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మాత్రం రూ.వేల కోట్లు కుమ్మరిస్తోంది.
Andhrapradesh: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇటు హైదరాబాద్, అటు బెజవాడలో ఉన్నట్టుండి వర్షం కురిసింది. భాగ్యనగరంలో గంట పాటు వర్షం పడగా.. అటు విజయవాడలో మాత్రం వర్ష బీభత్సం కొనసాగుతోంది. బెజవాడలో గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది.
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
ష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు వారాలకు పైగానే సమయం ఉండడంతో బెట్టింగ్ బంగార్రాజులు బరిలోకి దిగిపోయారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా పందేలు కడుతుండగా, రాయల
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల(Andhra Pradesh Elections) నేపథ్యంలో జగన్(YS Jagan) సర్కార్ విపరీత పోకడల కారణంగా మొత్తం పోలీసు శాఖపైనే మచ్చ పడింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం పోలీసు యంత్రాంగాన్ని అడ్డగోలుగా వాడుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టింది. దీని ఫలితంగా..
పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో దాచిన పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు భారీగా స్వాధీనపరచుకున్నారు. పోలీసులు అల్లర్లు జరిగిన గ్రామల్లో విస్తృత తనిఖీలు నిర్వహించేక్రమంలో ఇవి
మళ్లీ సంక్రాంతి వచ్చినట్లు.. జాతరేదో జరుగుతున్నట్లు.. ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు.. ‘పదండి ఓటేద్దాం’ అంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్ బూత్లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు. అమ్మా, నాన్నలతో కలిసి కొత్తగా ఓటొచ్చిన టీనేజ్ అమ్మాయి... అవ్వా తాతలతో కలిసి వచ్చిన సాఫ్ట్వేర్ కుర్రాడు.
Lok Sabha Election 2024 Live Updates in Telugu: దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. నాలుగో విడతలో భాగంగా నేడు నాడు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఏకకాలంలో పోలింగ్ జరగనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయమే జనం భారీగా తరలివచ్చారు. అధికార వైసీపీ కార్యకర్తలు దాడులతో భయాందోళన కలిగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.