Home » cryptocurrency
మీరు క్రిప్టో యాప్లను వినియోగిస్తున్నారా. అయితే జాగ్రత్త. ఎందుకంటే గూగుల్ తాజాగా 17 క్రిప్టో ఎక్స్ఛేంజ్ యాప్లను తొలగించింది. ఈ యాప్స్ వినియోగదారుల డేటా భద్రత సహా అనేక విషయాల్లో ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రముఖ క్రిప్టో కరెన్సీలతో వ్యూహాత్మక డిజిటల్ నగదు నిల్వలను ఏర్పాటు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించడం సంచలనానికి దారి తీసింది. క్రిప్టో కరెన్సీల విలువ ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేరకు పెరిగింది.
క్రిప్టో కరెన్సీపై ప్రస్తుతం అనిశ్చిత కొనసాగుతోంది. అందరి దృష్టి వారాంతంలో చోటుచేసుకునే పరిణామాలపై నెలకొంది బిట్కాయిన్ విలువ 89 డాలర్లు చేరుకునే అవకాశం ఉన్నా అమెరికా నిర్ణయాలు, ఆర్థిక ఒడిదుడుకులతో వాస్తవ విలువ కాస్త తగ్గొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Pi Coin Launch : బిట్కాయిన్కు పోటీగా పై కాయిన్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. స్పాట్ ట్రేడింగ్ పెయిర్ లిస్టింగ్ వార్త వెలువడిన వెంటనే Pi కాయిన్ ధర అమాంతం 106%కి పెరిగింది. అసలేంటి Pi కాయిన్.. దీని ధర, లాంచింగ్, తదితర పూర్తి వివరాలు..
ఇటివల కాలంలో దేశంలో అనేక మంది క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు చేస్తున్నారు. తాజాగా భారీ రాబడులు రావడంతో మరింత ఎక్కువ మంది దీనిపై మక్కువ చూపుతున్నారు. అయితే క్రిప్టోకరెన్సీపై ఇండియాలో ఆమోదం ఉందా, దీనిపై పన్ను విధానాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరైనా కూడా తక్కువ సమయంలోనే కోటీశ్వరులు కావాలని చూస్తారు. ఇప్పుడు అది పలువురి విషయంలో నిజం అయ్యింది. అది కూడా తక్కువ పెట్టుబడితో కోటీశ్వరులుగా మారిపోయారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ ధర లక్ష డాలర్లు దాటింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, బిట్కాయిన్ ధరలలో నిరంతర పెరుగుదల కనిపించడం విశేషం. గత నెలలోనే బిట్కాయిన్ ధర 50 శాతానికి పైగా పెరిగింది.
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ(Crypto Currency)తో ప్రపంచవ్యాప్తంగా(wrold wide) అనేక చోట్ల చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీనిని పలు ప్రాంతాల్లో అధికారికంగా గుర్తించగా, మరికొన్ని చోట్ల మాత్రం నిషేధించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇక్కడ మాత్రం అధికారికంగా అనుతించలేదు. అయినప్పటికీ ఇటీవల సంవత్సరాలలో క్రిప్టోకరెన్సీకి సంబంధించి పెట్టుబడిదారులలో భారీగా ప్రజాదరణ పెరిగింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజ్ WazirXపై 10 రోజుల క్రితం సైబర్ ఎటాక్(cyber attack) జరిగింది. ఆ క్రమంలో హ్యాకర్లు $230 మిలియన్ల (రూ.1,925,99,24,000) కంటే ఎక్కువ విలువైన పెట్టుబడిదారుల హోల్డింగ్లను లూటీ చేశారు. దీంతో ఈ సంస్థ US ఏజెన్సీ FBIని ఈ దాడి గురించి సంప్రదించగా, ఇందులో ఉత్తర కొరియా సైబర్ నేరస్థులు ఉండవచ్చని తాజాగా ప్రకటించారు.
చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు.. వేలకు లక్షలు.. లక్షలకు కోట్లు సంపాదించొచ్చంటూ వల వేస్తున్నారు కేటుగాళ్లు. అవగాహనలేమితో మోసపోయిన బాధితుల ఉదంతాలు చాలానే వెలుగుచూస్తున్నాయి.