Home » Cyclone
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
రీమల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.
దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.
ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఆకస్మాత్తుగా వచ్చిన తుఫాను,(Cyclone) వర్షం కారణంగా పశ్చిమ బెంగాల్(West Bengal)లోని అనేక ప్రాంతాలు వినాశనానికి గురయ్యాయి. ప్రధానంగా జల్పైగురి జిల్లా(Jalpaiguri district)లోని పలు ప్రాంతాల్లో తుఫాను భారీ విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలుల వల్ల జిల్లా కేంద్రమైన పట్టణంతోపాటు మైనగురి తదితర పరిసర ప్రాంతాల్లో అపార నష్టం జరిగింది.
Andhrapradesh: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. రేపటి (శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు బాబు పర్యటన కొనసాగనుంది.
ప.గో. జిల్లా: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నదాతకు అపారనష్టం సంభవించింది. ఏలూరు జిల్లాలో 68 వేల 55 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.
మైచాంగ్ తుఫాన్ కారణంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రైవేట్ కంపెనీలను కోరింది. లేదంటే అవసరమైన మేర తక్కువ సిబ్బందితో మాత్రమే పని చేయాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ‘హమూన్’గా తుపానుకు నామకరణం చేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్లో వర్షాలు కురవనున్నాయి.రేపు బంగ్లాదేశ్లోని హెపుపరా, చిట్టాగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
భారత్ కు ఒకే సారి రెండు తుపాన్ల(Cyclone) నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అరేబియా(Arabia) మహా సముద్రంలో తేజ్ తుపాను, బంగాళాఖాతం(Bay of Bengal)లో హమూన్ తుపాను రెండూ ఇండియా భూభాగంపైకి దూసుకువస్తున్నాయని స్పష్టం చేశారు.