Home » Election Commission of India
విపక్షాల పట్ల డీజీపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి వరుస ఫిర్యాదులు చేసింది. అక్రమ ఫోన్ టాపింగ్కు ఆమె పాల్పడ్డారంటూ గత నెలలో ఫిర్యాదు చేసింది.
నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఆర్ఎల్డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాము వ్యక్తం చేసిన సందేహాలపై ఎన్నికల సంఘం (ఈసీ) రాసిన లేఖను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది.
మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎన్నికల సంఘం తమకు తాము క్లిన్ చిట్ ఇచ్చుకుంటూ సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష, తమ పార్టీపై చేసిన ఆరోపణల కారణంగా తాము తిరిగి లేఖ రాసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈసీ ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే తాము న్యాయపరమైన ఆశ్రయం పొందడం మినహా మరో మార్గం లేదని పేర్కొంది.
అనురాగ్ గుప్తా స్థానంలో కొత్త డీజీపీ నియామకానికి వీలుగా సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారుల జాబితాను అక్టోబర్ 21వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా జార్ఖాండ్ ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్లోని పితౌరాగఢ్లో బుధవారంనాడు అత్యవసరంగా ల్యాండింగ్ అయింది.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారంనాడు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇదే సమయంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారంనాడు సమీక్షించారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్.ఎస్.సంధు తదితరులు పాల్గొన్నారు.