Home » Heavy Rains
ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించినందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని మంత్రి కోరారు.
తెలుగు రాష్ట్రాలను వరణుడు ఎంతలా వణికిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ జిల్లాలు, ఏపీలో విజయవాడ జిల్లా వరదలతో తీవ్రంగా ప్రభావితమైంది.
ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు(మంగళవారం) వచ్చారు. బ్యారేజ్లు, వరద మానిటరింగ్, వాతావరణ హెచ్చరికలను పవన్కు హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు.
నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల ద్వారా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. భవానీపురం నుంచి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా విజయవాడ నగరంలోని వివిధ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ భారీ వర్షాలు, వరదలకు పదుల సంఖ్యలో మరణించారు.
వరదల్లో చనిపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 3లక్షలు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) హామీ ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన రూ. 5లక్షల్లో కేంద్రం ఇచ్చే రూ. 3లక్షలు కలుపుకొని ఇస్తారా? లేదా? రాష్ట్ర ప్రభుత్వమే రూ. 5లక్షలు ఇస్తోందా? అనే విషయంపై క్లారిటీ లేదని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
Andhrapradesh: 48 గంటలుగా మహోగ్రరూపం దాల్చిన బుడమేరు కాస్త శాంతించింది. దీంతో బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం మూడు చోట్ల గండ్లు పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో యుద్ధ ప్రతిపాదికన పనులను చేపట్టారు.
నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి, రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది...