Home » Israeli-Hamas Conflict
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్(Israel), హమాస్(hamas) మధ్య హింసాత్మక ఘర్షణ ఆరు నెలలకు పైగా కొనసాగింది. ఈ ఘటనలో ఇప్పటికే 33 వేల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా లెబనాన్కు(Lebanon) చెందిన హిజ్బుల్లా(Hezbollah) ఉత్తర ఇజ్రాయెల్పై డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది.
ఇజ్రాయెల్(Israel)లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మరోసారి ఊపందుకున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ ప్రధాని( Israeli Prime Minister) బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) రాజీనామా(resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఆ క్రమంలో టెల్ అవీవ్, సిజేరియా, హైఫా వీధుల్లో వేలాది మంది వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి(Israel Hamas war) గాజా పౌరులు(gaza people) అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడి వారని ఆదుకునేందుకు పలు దేశాలు సహా ఐరాస రిలీఫ్ ప్యాకేజీలను పంపిస్తుంది. కానీ తాజాగా పంపించిన ప్యాకేజీ కూడా పలువురి పాలిట విషాదంగా మారింది.
ఇజ్రాయెల్పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు ఐదు నెలలుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్రాంతాల పరిష్కారానికి సపోర్ట్ చేస్తామని భారత్ వెల్లడించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం(Israel hamas war) ఇంకా ముగియకపోగా..అది మరింత తీవ్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే గాజాలోని ఒక ఆసుపత్రి సమీపంలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 11 మంది మరణించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు నెలల పైనే అవుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ని అంతమొందించాలన్న లక్ష్యంతో.. గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది.
ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న జరిగిన ఘోరమైన దాడిలో ప్రాణాలతో బయటపడిన కోహెన్.. పాలస్తీనా టెర్రరిస్ట్ సంస్థ హమాస్ క్రూరత్వాన్ని కళ్లకుకట్టినట్లు వివరించాడు. ఇజ్రాయెల్ మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేశారని చెప్పారు.
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది.