Home » Mahabubabad
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వాళ్లని తమ ఇళ్లకు తీసుకెళ్లగా.. ఇక, తాము కలిసి జీవించలేమనే ఆవేదనతో ఆ యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపునకు సీఎం రేవంత్రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు.
మహబూబాబాద్ జిల్లా: నేరడపెద్ద చెరువు జాతరను తలపించింది. చెరువులోచేపలు పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెకువు లూటీ పోయిందని మత్స్యకారులు ప్రకటించడంతో స్థానికులు చేపలు పట్టేందుకు తండోపతండాలు తరలి వచ్చారు.
మానుకోటలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
అసలే సమ్మర్.. ఆపై ఎన్నికల సీజన్.. కాస్త చిల్ అవుదామని.. చల్ల చల్లటి బీర్ కొడదామని మందు బాబులు వైన్ షాప్కి వెళ్లి బీర్ అడిగితే.. బీర్ గీర్ జాన్తా నై అంటూ వెళ్లగొడుతున్నారు. బ్లాక్లో అయినా పర్వాలేదు ఇవ్వన్నా అంటే.. అసలు బీర్లే లేవు సామీ అంటూ సమాధానం ఇస్తున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలని అన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఈ కోడ్ అయిపోగానే పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్(Balram Naik) అన్నారు. బుధవారం నాడు మణుగూరులోని డీవీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ (Congress) ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Telangana: తెలంగాణలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్కు షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది సీనియర్ నేతలు గులాబీ పార్టీకి గుడ్బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కొద్ది రోజుల క్రితం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాజాగా కడియం శ్రీహరి బీఆర్ఎస్కు గుడ్బై చెప్పేశారు. వీరి బాటలోనే భద్రాచలం ఎమ్మెల్యే కూడా నడవబోతున్నారా అంటే నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి.
Telangana: జిల్లాలోని గంగారం మండలం పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మధ్యాహ్నం పగిడిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. పగిడిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరి వెళ్లనున్నారు.
మహబూబాబాద్: పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్కు యత్నించాడు.