Home » Medchal–Malkajgiri
హైదరాబాద్లోని పాస్పోర్టు కేంద్రాల్లో ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. బేగంపేట్, అమీర్పేట్, టోలిచౌకిల్లోని పాస్పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ను నిలిపివేశారు. నిజానికి ఆన్లైన్లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నా.. బుకింగ్ జరగడం లేదు.
ఆ స్థలం ఎప్పుడో 45 ఏళ్ల క్రితమే వెంచర్గా మారిపోయింది. వందల మంది అక్కడ పైసలు పోసి ప్లాట్లు కొనుకున్నారు. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న ఆ స్థలాలు.. ఇప్పుడు రూ.కోట్లు పలుకుతున్నాయి. అయితే, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ లేఔట్కు మళ్లీ పట్టా పుస్తకాలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా తెరపైకి వచ్చిన కొందరు.. ఆ లేఔట్లోని రూ.50 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కెఫెటేరియాలు, వెయిటింగ్ లాంజ్లు ఇతర హంగులతో కార్పొరేట్ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్లు కట్టాలని భావిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న సుచిత్రలోని భూ వివాదం తాలూకు కాక చల్లారకముందే తాజాగా బొమ్మరాసిపేట గ్రామ పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆయన అక్రమంగా నిర్మించిన ప్రహరీ తెరమీదకొచ్చింది.
‘మాజీ మంత్రి మల్లారెడ్డి పాలు, పూలు అమ్ముడే కాదు.. భూ కబ్జాలు కూడా చేస్తుండు. ఆయన పేరే భూ కబ్జాల మల్లారెడ్డి. ఆయన కబ్జా చేసిన మా భూమిని మాకు ఇప్పించాలి. మల్లారెడ్డి తన తప్పు ఒప్పుకుని మాకు క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలి’ అని బాధితుడు సేరి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల రెవెన్యూ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలోని 1.11 ఎకరాల భూ వివాదంలో గొడవకు సంబంధించి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని.. ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. సర్వేనంబరు 82, 83లోని ఈ భూమి మాది అంటూ శ్రీనివాస్ రెడ్డి, మరో 15 మంది కలిసి శనివారం తెల్లవారుజామున కోర్టు పత్రాలను వెంటబెట్టుకొని వచ్చారు.
సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy), ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీరాబాద్ పీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారా స్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.