Home » Medigadda Barrage
లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
‘‘మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్-7లో ఉత్పన్నమైన సమస్యను రిపేరు చేయడానికి వీల్లేదు. మొత్తం బ్లాక్ను పునాదుల నుంచి తొలగించి, పునర్నిర్మించాలి.
సిద్దిపేట జిల్లా: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశాలను పేర్కొంది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో లోపం బయటపడింది. అన్నారం సరస్వతి బ్యారేజీకి లీకేజీలు కలకలం రేపుతున్నాయి. బ్యారేజీలో 28, 38 నంబర్ గల రెండు గేట్ల వద్ద లీకేజీతో నీరు ఉబికి వస్తోంది.
మేడిగడ్డపై కేంద్రం డెడ్లైన్ విధించింది. మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు నివేదికలు కోరింది. ప్రాజెక్టుకు సంబంధించిన 20 వేర్వేరు డాక్యుమెంట్లను కమిటీ కోరింది. వాటిలో 3 నివేదికలు, మరో నివేదికలో పాక్షికభాగం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.
మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు.
మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందుకుగల కారణాలను పరిశీలించడానికి కేంద్ర కమిటీని కేంద్రం నియమించింది.