Share News

Medigadda barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు.. నమోదు చేసిన మహదేవ్‌పూర్ పోలీసులు

ABN , First Publish Date - 2023-10-24T15:05:23+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్‌పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు.

Medigadda barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు.. నమోదు చేసిన మహదేవ్‌పూర్ పోలీసులు

మహదేశ్‌పూర్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్‌పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంతోనే ఫిర్యాదు చేశారు. కాగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


కేసుపై విచారణకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు ఇవ్వడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టిపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు.

Updated Date - 2023-10-24T15:16:44+05:30 IST