Home » NCP
ఓ సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహిఓ సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహితుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు. తుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన పదవికి తాజాగా రాజీనామా చేశారు.
మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో అసంతృప్తి మొదలైందా అంటే అవుననే అంటున్నారు అక్కడి విశ్లేషకులు. సీఎం హాజరైన పలు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే దూరంగా ఉండిపోవడం ఆసక్తికర పరిణామమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆర్ఎస్ఎస్పై శరద్ పవార్ పొగడ్తలకు దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ, పవార్ చాలా స్మార్ట్ అని, ఒక్కోసారి మన పోటీదారుల్ని కూడా ప్రశంసించాల్సి వస్తుందని అన్నారు.
నాగపూర్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మంత్రి పదవిని ఆశిస్తుంటారని, అయితే మంత్రి పదవులు పరిమితంగానే ఉంటాయని గుర్తు చేశారు.
బీజేపీ నుంచి 19 మంది, 11 మంది షిండే శివసేన నుంచి, తొమ్మిది మందిని ఎన్సీపీ నుంచి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాగపూర్లోని రాజ్భవన్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయుంచారు.
మహారాష్ట్ర ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో మహాయుతి కూటమి కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో అత్యధిక, అత్యల్ప మెజార్టీతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆ స్టేట్ పాలిటిక్స్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఏంటా ట్విస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..
ఉత్తరాది రాజకీయాలు, దక్షిణాది రాజకీయాలు భిన్నంగా ఉంటాయని, మహారాష్ట్ర ఎన్నికలు పూర్తిగా భిన్నమైనవని అజిత్ పవార్ చెప్పారు. 1985 నుంచి మహారాష్ట్రలో ఓ ఒక్క పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించలేదని, ఈసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరి సహాయం తీసుకోక తప్పదని అన్నారు.
అన్డివైడెడ్ ఎన్సీపీ లోగో అయిన 'గడియారం' గుర్తును వాడకుండా తన మేనల్లుడిని (అజిత్) నిరోధించాలని కోరుతూ శరద్ పవార్ వేసిన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ఎన్నికల ప్రచారం కోసం బుధవారంనాడు బారామతి వచ్చినప్పుడు ఎన్నికల అధికారులు తన బ్యాగులను తనిఖీ చేసినట్టు అజిత్ పవార్ ఒక ట్వీట్లో తెలిపారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.