Home » Panchumarthi Anuradha
Panchumarthy Anuradha: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ లిస్ట్ కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు.
గౌడ, బీసీ అని చెప్పుకునే కనీస అర్హత వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్కు లేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthy Anuradha) అన్నారు. అగ్రిగోల్డ్ భూముల అక్రమ కొనుగోలు వ్యవహారంలో తన కుమారుడు జోగి రాజీవ్(Jogi Rajeev) అరెస్టు కావడంతో జోగి రమేశ్(Jogi Ramesh) కుల ప్రస్తావనను తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఆంధ్రుల జీవనాడి పోలవరం (Polavaram)ను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (MLC Panchumarthy Anuradha) అన్నారు. 20ఏళ్ల క్రితం పోలవరానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసినా ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు.
గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంది. అలాంటి పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఓ పక్క సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆ పార్టీ నేడు ఓటమి అంచున నిలబడిందంటే.. అందుకు నెల్లూరు జిల్లాలో నాడు చోటు చేసుకున్న వరుస పరిణామాల కారణంగానే ఆ పార్టీ నేడు ఈ పరిస్థితికి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు.
ఒక్క ఎంపీ సీటు కోసం సొంత బాబాయినే చంపేశారని.. ఆ మాట జగన్ సొంత చెల్లే చెబుతోందని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కష్టాల నడుమ యువగళం పాదయాత్ర చేశారన్నారు.
లేని ఐఆర్ఆర్ విషయంలో విచారణ చేపట్టడం హాస్యాస్పదమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బిల్డప్ సీఎం జగన్ 27 సార్లు డిల్లీకెళ్లి సాధించేందేంటి అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, త్రిబుల్ ఐటీ నిధులు, వెనుకబడిన జిల్లాల రూ.1400 కోట్ల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనేనని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు పంచుమర్తి అనురాధ(Panchumurti Anuradha) వ్యాఖ్యానించారు.