Home » Pemmasani Chandrasekhar
ఆడపిల్లలకు మేనమామ అంటూ రాష్ట్రంలో వేల మంది అపహరణకు గురవుతున్నా ఏనాడూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద అని. ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కలసి రావాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని గ్రాండ్ క్యాన్యన్ తరహాలో గండికోటను అభివృద్థి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్థి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పారు.
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులకు కేంద్రం ఇవ్వడానికి సమ్మతి తెలిపిన విలువ రూ.60 వేల కోట్లు. నమ్మశక్యం కానన్ని నిధులు కేంద్రం నుంచి సాధించగలిగాం. వంద రోజుల్లో ఇన్ని నిధులకు సమ్మతి తెచ్చుకోవడం ఒక అద్భుతం’ అని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభిప్రాయ పడ్డారు.
సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టపడే తత్వం, మంచి బుద్ది, జ్ఞానం, సరిపడినంత ధనం, ధైర్యం కలిగిన తనలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చి అవసరమైన సాయం చేయకుంటే సమాజం బాగుపడదనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన వివరించారు.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి వీలైనంత సాయం అందించేందుకు కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. వ
సీఎం రిలీఫ్ ఫండ్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు.
గుంటూరు జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
భారత దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నాటికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekhar) ప్రకటించారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి పేదలకు వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar) తెలిపారు. నాట్కో ఫార్మా కంపనీ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.