Home » Pemmasani Chandrasekhar
పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయడమే తమ ముందున్న ప్రథమ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రజల కలల రాజధాని అమరావతి నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ మూడు సార్లు ప్రధానిగా చేసిన రికార్డ్ కేవలం జవహర్లాల్ నెహ్రూదే. ఇప్పుడు మోదీ ఆ రికార్డును సమం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి.. గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్కు తొలి దఫాలోనే కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1976 మార్చి 7న తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన ఆయ న.. డాక్టర్గా అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నత స్థాయికి ఎదిగారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మోదీ రికార్డు స్థాయిలో 3వ సారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమానం చేశారు. ఇక మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే.. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
కేంద్ర మంత్రివర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఆరు నుంచి ఏడుగురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు ఉన్నాయని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
గుంటూరు లోక్ సభ తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ పరిధిలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ అంటే తనకు అభిమానం అని, ఆయన మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. పనిలో పనిగా సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో అభ్యర్థులంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నేడు ఆయన.. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పెదకాకాని మండలం రెయిన్ ట్రీ అపార్ట్మెంట్ వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.