Home » Raptadu
ఎలాంటి అవాంతరాలు లేకుండా వ్యవసాయానికి, గృహాలకు మెరు గైన విద్యుత సౌకర్యం కల్పించాలని విద్యుత శాఖా ధికా రులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. నసన కోట పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ స్కీం పనులను ఆమె ఆదివారం విద్యుత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
గత వైసీపీ హయాంలో ఏ కార్యాలయంలోనూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదని, ఇప్పుడూ అలాగే వ్యవహరిస్తామంటే కుదరదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. నిర్లక్ష్యం వీడి, ప్రజలకు జవాబుదారీ తనంతో పనిచేయాలని సూచించారు. మండలంలోని గంగినేపల్లిలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సు లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొం టున్న భూసమస్యలపై పలువురు రైతులు ఎమ్మెల్యేకి అర్జీలు అందజేశారు.
కరువు ప్రాంతమైన ఉమ్మడి అనంతపురం జిల్లాకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి, సస్యశ్యామ లం చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తపన అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు.
మీకున్న పదవులతో బాధ్యతా యు తంగా పనిచేసి చెరువులకింద రైతులు నష్టపోకుండా చూడాలని సాగునీటి సం ఘం నూతన సభ్యులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. శనివారం జరిగి న ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాద్యక్షులు, సభ్యులు ఆదివారం వెంకటాపురంలో ఎమ్మెల్యేని కలిశారు. ఎటువంటి గొడవలులేకుండా ఏకగ్రీవంగా గెలవడంపై హర్షం వ్యక్తం చేసి, నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి పదవులు కాదు.. బాధ్యతలన్నది మరచిపోవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూ చించారు. నియోజకవర్గంలో శనివారం ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, టీసీ మెంబ ర్లు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ను కలిశారు. పుష్పగుచ్ధాలు అందజేశారు.
గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ... చిన్నారులకు ప్రాథమిక విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు అర్థంతరంగానే నిలిచిపోయాయి. సకాలంలో బిల్లులు కాలేదని కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపి వేశా రు.
రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అ తీతంగా జరగాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె గురువారం అనంతపురం లోని తన క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలోని 32 చెరువుల పరిధిలో సాగు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
ఊరికి అగ్నిమూలన శ్మశానం ఉందని, మరోచోట స్థలం కేటాయించాలని కామారుపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. మండలపరిధిలోని కామరుపల్లిలో తహసీల్దార్ మోహనకుమార్ అధ్యక్షతన మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీఓ కేశవనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గ్రామంలోని పలు సమస్యల ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల అభి వృద్ధి కుంటుపడింది. నిధులు లేకపోవడంతో గ్రామా ల్లో వీదిలైట్లు, సీసీ రోడ్లు, తాగునీరు వంటి కనీస వ సతులను కల్పించలేదు. దీంతో గ్రామ వీధులు మురు గునీరు, వర్షపు నీరు నిలిచి అధ్వానంగా మారా యి. వాటిపై సంచారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా రు. అయితే కూట మి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి న ఆరు నెలల్లోనే వివిధ రకాల అభివృద్ధి పనులు జరు గుతున్నాయి.
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోం దని, ఆర్నెల్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్ కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొ న్నారు. ఆమె సోమవారం మండలపరిధిలోని కుంటిమద్ది గ్రామంలో రూ. 36.50 లక్షల వ్యయంతో ఎనఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీరోడ్లను స్థానిక టీడీపీ నాయకు లు, అధికారులతో కలిసి పరిశీలించారు.