Home » Samajwadi Party
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా? అంటే.. తాజా పరిణామాలు అందుకు అవుననే సమాధానాలు చెప్తున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై ఇండియా కూటమి నేతలు స్పందిస్తున్నారు. ముందుగా పశ్చిమబెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనూహ్య రీతిలో టీడీపీ చీఫ్ అరెస్ట్పై స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదని అన్నారు. ఇప్పుడు తాజాగా యూపీ మాజీ సీఎం, ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) అధినేత అఖిలేష్ యాదవ్ .. చంద్రబాబు అరెస్ట్పై ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సుధాకర్ సింగ్ ఘనవిజయం సాధించారు. తన బీజేపీ ప్రత్యర్థి దారా సింగ్ చౌహాన్పై ఏకంగా 42,759 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో...
మన దేశం హిందూ దేశమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య తీవ్రంగా ఖండించారు. భారత దేశం ఇప్పుడు, గతంలో హిందూ దేశం కాదని చెప్పారు. ఇండియా సహజంగానే బహుళత్వంగల దేశమని చెప్పారు.
‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీజేపీ చేస్తున్న మరో ప్రయత్నం ఇదని దుయ్యబడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రధాన విపక్ష పార్టీల మధ్య సయోధ్య నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్కు కాంగ్రెస్ పార్టీ శనివారంనాడు మద్దతు ప్రకటించింది.
సమాజ్వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఒక వ్యక్తి షూ విసరడం ఉద్రిక్తతతకు దారితీసింది. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్ వద్ద సోమవారం జరిగిన ఓబీసీ సమ్మేళన్లో మౌర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ దుస్తుల్లో ఉన్న ఓ యువకుడు మౌర్యపై షూ విసిరాడు. దీంతో వెంటనే మౌర్య మద్దతుదారులు మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు.
ఉత్తర ప్రదేశ్ శాసన సభలో శుక్రవారం నవ్వులే నవ్వులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. ఓం ప్రకాశ్ రాజ్భర్కు మంత్రి పదవి ఇవ్వాలని శివపాల్ యాదవ్ కోరడంతో సీఎం చతురతతో స్పందించి, నవ్వులు పూయించారు.
రానున్న లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు ఊహించని దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్ అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది.