Home » Saudi Arabia
ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషితో సౌదీ అరేబియాలో చిక్కుకున్న బాధితుడు ఇండియాకు సురక్షితంగా వస్తున్నారు. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడినట్లు, యువకుణ్ని బుధవారం రోజున దేశానికి తీసుకువస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు.
ఈ ఏడాది హజ్ యాత్రలో మృతిచెందిన వారి సంఖ్య 1,300 దాటినట్లు సౌదీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల వల్లే ఈ మరణాలు సంభవించినట్లు పేర్కొన్నాయి.
ఈ ఏడాది సౌదీ అరేబియాలో హజ్ యాత్ర సందర్భంగా వేర్వేరు కారణాలతో 98 మంది భారతీయులు మరణించినట్టు కేంద్రప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.
అగ్రరాజ్యం అమెరికా(america)కు సౌదీ అరేబియా(Saudi Arabia) షాకిచ్చింది. అమెరికాతో 50 ఏళ్ల నాటి పెట్రో డాలర్ ఒప్పందాన్ని(petrodollar deal) పునరుద్ధరించకూడదని సౌదీ అరేబియా నిర్ణయించింది. అయితే పెట్రోడాలర్ ఒప్పందం జూన్ 9తో ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
క్రూరమృగాలు, విష సర్పాలతో ఆటలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందని చూస్తుంటాం. కొందరు బోనులో ఉన్న సింహాలను కెలికి చివరకు వాటి దాడికి గురవుతుంటారు. మరికొందరు బుసలు కొడుతున్న పాముల వద్ద పిచ్చి చేష్టలు చేస్తుంటారు. అయితే...
ఛాందసవాద ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా.. కొంతకాలంగా ఆధునిక పంథాలో పయనిస్తోంది. యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, ప్రగతిశీల ఆలోచనా ధోరణితో చేపట్టిన సంస్కరణలు, ఆ దేశాన్ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా మరో సంచలనానికి సౌదీ తెరతీసింది.
భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రాజెక్టుల నిర్మాణం చేపడి తే ప్రజల నుంచి భూమిని సేకరించడం, బాధితులకు పరిహారం ఇవ్వడం, పునరావాసం కల్పించడం సహజంగా జరిగేవి.
నియోమ్ ప్రాజెక్టును సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నియోమ్ పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది. తమ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరైనా అడ్డొస్తే చాలు.. చంపేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా దళాల్లో పనిచేసిన ఒక అధికారి వివరించారు.
తన కూతురితో సమానమైన ఒక విద్యార్ధినికి ఆసుపత్రిలో ల్యాబ్లో రక్త పరిక్ష నమూనా విధానాన్ని వివరిస్తున్న క్రమంలో కంప్యూటర్ మౌజ్పై ఉన్న అమె చేయిపై పొరపాటున చేయి పెట్టినందుకు సౌదీ అరేబియాలో న్యాయస్థానం ఒక భారతీయ డాక్టర్కు అయిదేళ్ళ జైలు శిక్ష, లక్షన్నర రియాళ్ల (సుమారు 33.5 లక్షల రూపాయాల) జరిమానాను విధించింది.