Home » Singanamala
సాగు, తాగు నీటి ప్రాజెక్ట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వాటి ఆధునీకరణ చేపట్టాలని సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శిం చారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపోర్లుతున్న సుబ్బరాయసాగర్ నింపలేని దౌర్భాగ్యస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం మండలపరిధిలోని నడిందొడ్డి, కేసేపల్లి మీదుగా మం డల కేంద్రమైన నార్పలకు చేరింది.
జాతీయ రహదారి పనుల్లో భాగంగా శింగనమల మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని శింగనమల రహదారి పోరాట సమితి సభ్యులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం జాతీయ రహదారికి అడ్డంగా కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మరవకొమ్మ వద్ద బ్రిడ్జి నిర్మించాలని పలు మార్లు అధికారులకు ప్రయోజనం లేకపోయిందన్నారు. గంటపాటు ధర్నా చేపట్టారు.
జాతిపిత మహాత్మ గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజాన్ని నేడు కూటమి ప్రభుత్వం నెరవేర్చ బోతోం దని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొ న్నారు. పల్లెపండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని బుధవారం మండల పరిధిలోని ముంటిమడుగు, కొత్తూరు గ్రామాల్లో చేపట్టారు.
వైద్యఆరోగ్యశాఖలో ఓ చిరుద్యోగి ఆర్ఎంపీ డాక్టర్గా అవతారమెత్తి క్లినిక్ నడపడంపై వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఈబీ దేవి ఈబీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తనిఖీ చేసి క్లినిక్ను సీజ్ చేయించారు.
గ్రామాభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం హిందూ శ్మశానవాటిక సౌకర్యార్థంతో పాటు సమీప కాలనీలకు రహదారి నిర్మాణానికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.14లక్షల నిర్మాణ వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ-పంట నమోదులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ హెచ్చరించారు. మండలంలోని కల్లుమడి, దనపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ-పంట నమోదు సూపర్ చెక్ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
టీడీపీ ప్రభుత్వం వచ్చింది... మనల్ని ఎప్పుడు మారుస్తారో తెలియ దు... ఉన్నన్ని నెలల్లో ఏదో కొంత మందికి రేషన బియ్యం ఇచ్చి మిగితా వారికి ఇవ్వకుండా పక్కదా రి పట్టించినా పట్టించుకునేవా లేరు అన్న ధోరణి లో పలువురు రేషన డీలర్లు వ్యవహరిస్తున్నారు. నార్పల మండల వ్యాప్తంగా 52మంది రేషన డీల ర్లు ఉన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతోంది.
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని చామలూరులో ఆదివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు హాజరయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వం మండల వ్యాప్తంగా రీసర్వే చేపట్టిన తరువాత పలువురు రైతుల భూములు మా యం కావడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు పడుతు న్నారని ఎంపీటీసీ రఘునాథరెడ్డి రెవెన్యూ అఽధికారులను నిలదీశారు. స్థానిక మండల పరిషత కార్యాలయంలో గురువారం ఎంపీపీ యోగేశ్వరి అధ్యక్షతన ఎంపీడీఓ నిర్మ లకుమారి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని గ్రామల్లో తాగునీటి సమస్యను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కారించాలని ఎమ్మెల్యే బండా రు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన అధికారుల తో సమావేశం నిర్వహించారు.